సత్యసాయి: ఓడీసీ మండలంలో ‘రైతన్న మీ కోసం’ కార్యక్రమాన్ని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి నిర్వహించారు. స్థానిక అధికారులు, కూటమి నాయకులతో కలిసి రైతులకు వ్యవసాయ అభివృద్ధిపై అవగాహన కల్పించారు. సాగును లాభసాటిగా మార్చే పంచ సూత్రాలతో కూడిన కరపత్రాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.