ATP: తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో కార్తీకమాసం ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసం తొలి శనివారం సందర్భంగా ప్రత్యేక అలంకరణలో బుగ్గ రామలింగేశ్వరస్వామి దర్శనం ఇచ్చారు. ఉదయాన్నే అర్చకులు వివిధ అభిషేకాలు నిర్వహించి కుంకుమ అలంకారంలో స్వామిని అలంకరించారు. వందలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు.