ASR: పాడేరు ITDA కార్యాలయం ఎదుట MGNREGA రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. MGNREGA నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం గిరిజన-దళితుల జీవన హక్కులపై దాడి అని ఆమె పేర్కొన్నారు.