NDL: రాష్ట్రంలో తొమ్మిది నెలల కూటమి ప్రభుత్వ హాయంలో ఏ ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోగా ఉన్న కార్డులను కుదించేందుకు ఈ నెలాఖరులోపు ఈకేవైసీ కచ్చితంగా చేయించాలని లబ్ధిదారులను భయాందోళనకు గురి చేయడం తగదని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు ఒక ప్రకటనలో గురువారం అధికారులకు తెలిపారు. ఈకేవైసీ చేయించుకునేందుకు గడువు జూన్ చివరి వరకు పొడిగించాలన్నారు.