ATP: కళ్యాణదుర్గం పరిధిలోని గువనపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు ముదిగలకు చెందిన సోదరీసోదరులు చంద్రకళ (32), శివకుమార్ (36), హనుమంత రాయుడు (40)గా గుర్తించారు. కర్ణాటకలోని మొలకల్మూరులో వివాహానికి వెళ్లి వస్తుండగా, అనంతపురం నుంచి రాయదుర్గం వెళ్తున్న బస్సు వీరి కారును ఢీకొంది.