సత్యసాయి: జిల్లా పోలీస్ శాఖలో టీఏ (TA) బిల్లుల అవకతవకలకు పాల్పడిన సీనియర్ అసిస్టెంట్ ఎస్.విశ్వతేజను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2022 నుంచి 2025 జనవరి వరకు సుమారు రూ. 8.90 లక్షల ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా తన కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించినట్లు విచారణలో తేలింది.