ప్రకాశం: ఒంగోలు పరిధిలోని కొత్త డొంక ప్రాంతంలో సోమవారం పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ. 5,450 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలిసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.