E.G: రాజమండ్రి రూరల్ మండలం కోలమూరు పంచాయతీ రాయుడుపాకలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం శంకుస్థాపన చేశారు. ఆలయ సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయ పునర్మాణం, రాజగోపురం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు పాల్గొన్నారు.