VZM: రామతీర్థంలో శ్రీరామనవమి ఉత్సవాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె రామతీర్థం ఆలయాన్ని సందర్శించి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రామతీర్థం కొండ చుట్టూ నిర్మిస్తున్న గిరి ప్రదక్షిణ రహదారి పనులను స్వయంగా పరిశీలించారు.