GNTR: తెనాలి రూరల్ PS పరిధిలోని గంజాయి కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ నాయబ్ రసూల్ తెలిపారు. ఈ ఏడాది జనవరిలో గంజాయి విక్రయిస్తున్న 8 మందిని అరెస్టు చేసి వారి వద్దనుంచి 1600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోగా, తెనాలికి చెందిన షేక్ ఫిరోజ్, కోటి సాయి మంజునాథ్ పరారీలో ఉన్నట్లు సీఐ చెప్పారు.