ప్రకాశం: శానంపూడి ZPHS సింగరాయకొండ విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షలో విజయకేతనం ఎగరవేశారు. ఏకంగా 11 మంది విద్యార్థులు 5వ తరగతి సీట్లు సాధించి రికార్డు సృష్టించడం విశేషం. ఉపాధ్యాయులు, న్యాయవాది వెంకటేశ్వర్లు, గ్రామ పెద్దలు బుధవారం పాఠశాలలో ప్రతిభచూపిన విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఘన విజయంపై స్థానికులు గర్వపడుతున్నారు.