GNTR: రాష్ట్రంలోని 16 సంఘాల ఆధ్వర్యంలో మంగళగిరిలో ‘చేనేత గర్జన’ నిర్వహించారు. ఎన్నికల్లో ఇస్తానన్న రూ. 25 వేల సాయం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీలు అమలు చేయలేదని కార్మికులు మండిపడ్డారు. రూ. 203 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిధులు ఇచ్చామని మంత్రి సవిత అబద్ధాలు చెప్తున్నారని, కేంద్రం జీఎస్టీ భారం తగ్గించాలని కోరారు.