ATP: గుత్తిలోని పురాతన కోట రామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సీతారాముల ఉత్సవ విగ్రహాలకు పంచామృతాభిషేకం, సంప్రోక్షణ వంటి విశేష పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.