W.G: మే 9న తణుకులో మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నాలుగో అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవా సేవల సంస్థ ఆధ్వర్యంలో తణుకు కోర్టు ఆవరణలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ లోక్ అదాలత్ ద్వారా రాజీపడదగిన అన్ని క్రిమినల్, సివిల్ కేసులతోపాటు చెక్ బౌన్స్ కేసులు, భార్య భర్తల కేసులు రాజీ చేసుకోవచ్చని తెలిపారు.