NDL: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొత్తూరులో కొలువైన శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆళ్ళగడ్డ పట్టణానికి చెందిన వెంకట నాగరాజు 395 గ్రాముల వెండి నాగభరణము వితరణ చేశారని ఈవో రామకృష్ణ తెలిపారు. వెండి నాగాభరణం అందించిన దాతలకు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేసినట్లు వివరించారు.