CTR: మహిళల అభివృద్ధే ధ్యేయంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. పుంగనూరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం నిర్వహించారు. మహిళల కోసం ఉచిత గ్యాస్, బస్సులో ఉచిత ప్రయాణం కల్పించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో భాగంగా డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టారని అన్నారు.