ప్రకాశం: కంభం పట్టణంలో సోమవారం ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లకు స్థానిక ఎస్సై శివ కృష్ణారెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనర్లు నడుపుతున్న వాహనాలను స్వాధీనం చేసుకొనివాహన యజమానులను పోలీస్ స్టేషన్కు పిలిపించి వార్నింగ్ ఇచ్చి, జరిమానా విధించారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇచ్చివారు రోడ్డు ప్రమాదానికి కారణమైతే వాహన యజమానిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.