KKD: పెద్దాపురం మహారాణి సత్రం వద్ద ఈవో శ్రీనివాస్ ఏర్పాటు చేసిన శ్రీరామనవమి ఫ్లెక్సీలు చర్చనీయాంశమయ్యాయి. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కుమారుడు రంగనాగ్ ఫోటోను వేసి, ఆయనను ఏకంగా ‘ఎమ్మెల్యే’గా పేర్కొనడం గందరగోళానికి దారితీసింది. నేతల మెప్పుకోసమే ఈవో ఇలాంటి తప్పులు చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.