W.G: భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లకు సీఐ నాగరాజు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. వారి ప్రస్తుత జీవన విధానం, వృత్తుల గురించి ఆరా తీశారు. గత నేర ప్రవృత్తిని వీడి, సత్ప్రవర్తనతో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని ఆయన హితవు పలికారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.