ATP: తాడిపత్రిలోని బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. గత 11 రోజుల నుంచి జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా రామలింగేశ్వరుడు, రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ఏకాంతోత్సవం జరిపారు. ముగింపు వేడుకల్లో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.