అనంతపురం మార్కెట్ యార్డ్లో ప్రజలు, రైతుల సౌకర్యార్థం RO వాటర్ ప్లాంట్ నిర్మాణ పనులను ఛైర్పర్సన్ బల్లా పల్లవి సోమవారం ప్రారంభించారు. మార్కెట్ యార్డ్లో తాగునీటి అవసరాల దృష్ట్యా ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను కోరగా, ఆయన వెంటనే నిధులు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో ఎంపీ బృందంతో కలిసి ఆమె భూమి పూజ నిర్వహించారు.