తూ.గో: రాజమండ్రి మార్కెట్ యార్డ్ సబ్ స్టేషన్ పరిధిలో అత్యవసర మరమ్మతుల కారణంగా బుధవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శామ్యూల్ తెలిపారు. దీంతో జయకృష్ణపురం, బిజిలి ఐస్ ఫ్యాక్టరీ, గణేశ్ నగర్, కంబాల పార్క్, ఇన్కమ్ టాక్స్ ఏరియా తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.