ATP: శింగనమల నియోజకవర్గ పరిశీలకుడు మన్నె సుబ్బారెడ్డి స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణిని కలిశారు. ఆయనను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు. మహానాడును విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వారు చర్చించారు. పార్టీ బలోపేతానికి, రాబోయే కార్యక్రమాల విజయవంతానికి క్యాడర్ అంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.