ATP: అనంతపురం మార్కెట్ యార్డ్లో సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం ఛైర్పర్సన్ బల్లా పల్లవి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈనాం సిబ్బంది, సూపర్వైజర్లు, గ్రేడ్–1, గ్రేడ్–2 అధికారులు, యూడీసీ, ఎల్డీసీలు, గార్డులు నుంచి ఆమె వివరాలు సేకరించారు. సిబ్బంది ఎదుర్కొంటున్న సాధకబాధకాలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.