BPT: లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న భట్టిప్రోలుకు చెందిన బండారు దేవి వరప్రసాద్కు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.6 లక్షల ఆర్థిక సాయం (LOC) మంజూరైంది. ఈ మొత్తాన్ని గురువారం గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో బాధితుడి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అందజేశారు. ప్రభుత్వం ఆపదలో ఉన్న వారికి ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.