PLD: దేవరంపాడులోని శ్రీ మత్స్యావతార నేతి వెంకన్న స్వామి ఆలయంలో రెండో శనివారం ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. వేడుకల అనంతరం ఆలయ కమిషనర్ డి. చంద్రశేఖర్ పర్యవేక్షణలో అధికారులు హుండీ కానుకలను లెక్కించారు. ఈ లెక్కింపులో హుండీ ద్వారా రూ. 6,08,489, దర్శన టిక్కెట్ల ద్వారా రూ. 4,22,220 ఆదాయం వచ్చినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.