ఏలూరు: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం బోటనీ , హిస్టరీ వన్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. 3,197 మంది విద్యార్థులకు 2,707 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 490 మంది పరీక్షకు గైహాజరయ్యారని దీని కారణంగా 85% హాజరు నమోదు అయిందని అధికారులు వివరించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశామన్నారు.