BPT: మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతిని వేటపాలెం జడ్పీ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. టీచర్స్, స్టూడెంట్స్ పూలతో ఘనంగా ఆయనకు నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, సామాజిక సమానత్వ సాధనకి కృషి చేసిన మహోన్నత వ్యక్తి పూలే అని ఇంఛార్జ్ హెచ్ఎం యూ.వేణుగోపాల్ కొనియాడారు. స్త్రీ విద్య, ఉన్నతి కోసం ఆయన చేసిన కృషిని టీచర్స్ కీర్తించారు.