TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి అనుబంధ భరద్వాజ తీర్థం అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగగా దేవస్థానం ఛైర్మన్ శ్రీ కొట్టే సాయి ప్రసాద్ తక్షణమే స్పందించారు. ఆయన స్వయంగా రంగంలోకి దిగి దేవస్థానం, అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టారు. ఛైర్మన్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ప్రస్తుతం మంటలను ఆర్పే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.