CTR: మద్యం సేవించి వాహనాలు నడిపిన 9 మందిని పోలీసులు పట్టుకుని 1st స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.90,000 జరిమానా విధించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరించారు.