KKD: పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అధారిటీ (పాడా) కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాడా ఎపీడీ వసంత మాధవి పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజల నుంచి వివిధ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల వద్ద నుంచి వివిధ అంశాలపై 53 అర్జీలు అందాయన్నారు. ఈ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.