PPM: గంజాయి, మాదకద్రవ్యాలు అక్రమంగా రవాణా చేయడం చట్టరీత్య నేరమని సాలూరు పట్టణ సీఐ అప్పలనాయుడు తెలిపారు. శనివారం సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్లో డ్రైవర్లకు, కండక్టర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. బస్సులలో అనుమానాస్పద వ్యక్తులు కనపడినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, డిపో మేనేజర్ పాల్గొన్నారు.