KDP: జమ్మలమడుగు పట్టణంలో ప్రధాన రోడ్లపై చెత్త చెల్లాచెదురుగా పడిపోవడంపై DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దాల్మియా సిమెంటు పరిశ్రమకు వ్యర్థాలను తరలిస్తున్న లారీలు పట్టణంలోకి ప్రవేశిస్తూ రోడ్లను అపరిశుభ్రం చేస్తున్నాయని ఆరోపించారు. చెత్త లారీలు బైపాస్ మార్గంలోనే వెళ్లేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.