AKP: పారిశుధ్య పనులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పంచాయతీ కార్యదర్శులను జిల్లా పంచాయతీ అధికారి సందీప్ హెచ్చరించారు. ఈనెల 23న సీఎం చంద్రబాబు నక్కపల్లి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఎస్ రాయవరం మండలం నుంచి నక్కపల్లి మండలం వరకు పారిశుధ్య పరిస్థితిని పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు.