గుంటూరు, కృష్ణ జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కేఎస్ లక్ష్మణరావు పదవీకాలం శనివారంతో పూర్తయింది. ఈ నేపథ్యంలో గత ఆరేళ్లుగా సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు ఆదివారం తెలిపారు. భవిష్యత్తులో ప్రజాప్రయోజనాలు, ప్రజల సమస్యలు కోసం వివిధ పద్ధతులలో పని చేస్తానని ఆయన తెలిపారు. ఇప్పటికీ మొత్తం 14ఏళ్లు ఎమ్మెల్సీగా అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేశానన్నారు.