E.G: శ్రీరామనవమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఈ నెల 26న రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు DPTO వైఎస్ఎన్ మూర్తి తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి గంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందన్నారు. భద్రాచలంతో పాటు సమీప క్షేత్రాలకు అద్దెపై బస్సులు కూడా ఏర్పాటు చేశామన్నారు. గోకవరం, కొవ్వూరు, నిడదవోలు డిపోల నుంచి కూడా భద్రాచలానికి బస్సులు ఉంటాయని పేర్కొన్నారు.