ATP: కళ్యాణదుర్గంలో నిర్మించిన నగరవనం పార్కు ప్రారంభోత్సవానికి రావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను MLA అమిలినేని సురేంద్ర బాబు ఆహ్వానించారు. ఈ మేరకు అమరావతిలో ఆయనను కలిసి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలని, పంచాయతీరాజ్ నిధుల నుంచి గ్రామీణ రహదారుల నిర్మాణం చేపట్టాలని కోరారు.