కడప జిల్లాలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ నిర్వహించిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన ఎస్సీ అభ్యర్థులు ఓబులేసు, హర్షసాయి వర్ధన్లకు బుధవారం కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి UPSC ప్రిలిమ్స్ కోచింగ్ కోసం డిజిటల్ ట్యాబ్లను అందజేశారు. ఈ ట్యాబ్లలో UPSC స్టడీ మెటీరియల్ ముందుగానే ఇన్బిల్ట్ చేయబడి ఉంది. ఇది వారి సివిల్స్ ప్రిపరేషన్కు ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.