W.G: నరసాపురంలో అక్రమ వడ్డీ వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా నాయకుడు కవురు పెద్దిరాజు శుక్రవారం డిమాండ్ చేశారు. బాధితురాలు రమణతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అప్పు తిరిగి చెల్లిస్తామన్నా.. బంగారం ఇవ్వడం లేదని ఆరోపించారు. వడ్డీ వ్యాపారులకు వత్తాసు పలుకుతున్న నరసాపురం రూరల్ CI దుర్గా ప్రసాద్పై చర్యలు తీసుకోవాలని కోరారు.