SKLM: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై సామూహికంగా దాడి చేసిన ఎస్ఎఫ్ఐ గుండాలను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిగిలిపల్లి మదన్ కుమార్ డిమాండ్ చేశారు. టెక్కలిలోని ఇందిరాగాంధీ జంక్షన్ వద్ద శుక్రవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.