SKLM: రేపటి నుంచి జరగనున్న 10వ తరగతి పరీక్ష కేంద్రాల ఏర్పాటుపై ఇవాళ అధికారులు పర్యవేక్షించారు. జలుమూరు మండలం చల్లవానిపేట ZPHS, అరుణోదయ విద్యాలయ సంస్థ విజ్ఞాన్ దుర్గ హై స్కూల్ కేంద్రాలను ఎంపీడీవో బి.చిన్నముడు ఎన్జీవో బి.మాధవరావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మల్లేశ్వరరావు వెల్ఫేర్ అసిస్టెంట్ శంకర్రావు పాల్గొన్నారు.