అన్నమయ్య: రాజంపేట మండల పరిధి బోయినపల్లిలోని శాన్వి ఇంటర్నేషనల్ పాఠశాలలో ఆదివారం ఉచిత వైద్య మెగా శిబిరం నిర్వహిస్తున్నట్లు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్ కుమార్ రాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కంటి, బీపీ, షుగర్ వంటి పరీక్షలు చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.