కోనసీమ: ఐ.వీ.ఆర్.ఎస్ సర్వేలో మండపేటకు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం లభించడం పట్ల ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఉత్తమ ఫలితాలు సాధించలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం వరుసగా రెండు సార్లు మండపేట మున్సిపాలిటీకి అవార్డు దక్కడం ఆనందంగా ఉందన్నారు.