KRNL: ఆదోనిలో సుందరయ్య భవన్ సీపీఎం కార్యాలయం నిర్మాణానికి డీవైఎఫ్ఐ పట్టణ నాయకులు సతీష్ గారి తల్లి గ్రేసమ్మ ఆదివారం రూ.10,111 విరాళంగా అందించారు. ఈ విరాళాన్ని పార్టీ నాయకులకు ఆమె స్వయంగా అందజేశారు. కార్యాలయ నిర్మాణానికి సహకరించినందుకు సీపీఎం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి ఇటువంటి సహకారం మరింత ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు.