ప్రకాశం: కనిగిరిలో గురువారం వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కార్యకర్తలు, నాయకులు విజయవంతం చేయాలని వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ బుధవారం తెలిపారు. ఉదయం 9 గంటలకు వైసీపీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్,10 గంటలకు చెక్పోస్ట్ వద్ద వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం జరుగుతుందన్నారు. కావున నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.