BDK: భద్రాచలంలో ఉన్న జాబిల్లి హాస్పిటల్, రాధ హాస్పిటల్లను DMHO డా.తుకారామ్ రాథోడ్ ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ఆసుపత్రుల పనితీరు, అందిస్తున్న వైద్య సేవలను సమీక్షించిన డీఎంహెచ్వో ఆసుపత్రి యాజమాన్యాలకు పలు సూచనలు చేశారు. రోగుల సౌకర్యార్థం సేవల చార్జీలు, అందుబాటులో ఉన్న వైద్య సేవలు ప్రదర్శించేలా ఏర్పాటు చేయాలన్నారు.