PPM: కొమరాడ పోలీస్ స్టేషన్ను పార్వతీపురం ఏఎస్పీ మనీషా రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అధిక ప్రమాదాలు జరిగే ప్రాంతాలను, బ్లాక్ స్పాట్, కోనేరు చెక్ పోస్ట్ను తనిఖీలు చేశారు. ప్రమాదాలు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఆనంతరం పదవ తరగతి పరీక్ష కేంద్రాలను తనిఖీచేసి, విద్యార్థులు అందుతున్న సౌకర్యాలు క్షుణ్ణంగా పరిశీలించారు.