BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని తైబజార్ వేలం పాట కార్యక్రమాన్ని ఈ నెల 30న నిర్వహించనున్నట్లు సర్పంచ్ నిమ్మల శంకర్, GP కార్యదర్శి రాంబాబు తెలిపారు. ఆసక్తి గల వారు ఉదయం 10 గంటలకు రూ.10,000 డిపాజిట్ చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. నమోదు చేసుకున్నవారికి మాత్రమే వేలం పాట పాడే అవకాశం ఉంటుందని వారు స్పష్టం చేశారు.