GNTR: శాసనమండలిలో వైసీపీ నేతలు ప్రదర్శించిన తీరును సభ్య సమాజం హర్షించదని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి విమర్శించారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో మాట్లాడిన ఆమె, వేంకటేశ్వరస్వామి ఫోటోలు పట్టుకుని, కాళ్లకు షూలు వేసుకుని సభలోకి రావడం అపచారమని మండిపడ్డారు. దేవుడి పట్ల భక్తి లేని ఇలాంటి చర్యలు క్షమించరానివని ఆగ్రహం వ్యక్తం చేశారు.