ELR: కొయ్యలగూడెం మండలం బయన్నగూడెం గ్రామానికి చెందిన పారేపల్లి సురేష్ (36) సోమవారం పాముకాటుకు గురై మృతి చెందాడు. తమ పొలంలో నిమ్మకాయలు ఏరుతుండగా పాము కాటు వేసినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబీకులు వెంటనే కొయ్యలగూడెం ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం తరలించగా చికిత్స పొందుతూ సురేష్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.